ఆస్పత్రిలో అమానుషం: రెండు కాళ్లు పట్టుకుని రోగిని ఈడ్చుకెళ్లారు (వీడియో)
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో వీల్చైర్ గానీ, స్ట్రెచర్ కానీ అందుబాటు లేకపోవడంతో ఓ రోగిని అతని కుటుంబసభ్యులు రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గత నెల అంటే మార్చి 31న సాయంత్రం ఓ రోగిని ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. అయితే, ఓపీ మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండటంతో ఆ రోజు కుదరలేదు. దీంతో రాత్రంతా అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తర్వాత.. రోగి కుటుంబసభ్యులు ఓపీ రిజిస్టర్ చేయించారు.దీంతో రెండో అంతస్తులోని డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు.

అయితే, రోగి స్పృహలో లేకపోవడంతో అతనికి స్ట్రెచర్ అవసరమైంది. కానీ, స్ట్రెచర్ కానీ, వీల్ చైర్ కానీ అందుబాటులో లేకపోవడంతో రోగిని అతని తల్లిదండ్రులు రెండు కాళ్లు పట్టి నేలపైనుంచే లిఫ్టు వరకు లాక్కెళ్లారు. ఈ ఘటనను చూసి అక్కడున్నవాళ్లు అంతా షాకయ్యారు. రెండో అంతస్తులో కూడా రోగిని అలాగే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.
దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రోగిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలో చోటు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తుతున్నాయి.
This video is said to be from a govt hospital Nizamabad, Telangana.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 15, 2023
Just see how a hospital staff is taking the patient to the lift, by pulling his legs.
Really shameful! And the CM & his Son are busy in their political meetings. pic.twitter.com/cQFxhyzjyI
ఆస్పత్రిపై అసత్య ప్రచారం చేయొద్దన్న సూపరింటెండెంట్
కాగా, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి రోగిని అతని కుటుంబసభ్యులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.
సదరు రోగిని సహాయకులు మార్చి 31వ తేదీన ఆస్పత్రికి తీసుకొచ్చారని సూపరింటెండెంట్ తెలిపారు. లిఫ్ట్ వచ్చిందన్న తొందరలో సహాయకులే రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. అది గమనించిన సిబ్బంది వాళ్లను వారించి వీల్ఛైర్లో తీసుకెళ్లారని వివరించారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications