అది సైకో బ్యాచ్ పనే: ఒంటరి మహిళపై అత్యాచారం, తీవ్రంగా దాడి చేశారు
కామం.. వారిని రాక్షసులుగా మార్చివేసింది. పశుప్రవృత్తి.. వారిని అమాయక మహిళపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేలా చేసింది. ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో మతిస్థిమితం లేని మహిళపై నలుగురు వ్యక్తులు
వరంగల్: కామం.. వారిని రాక్షసులుగా మార్చివేసింది. పశుప్రవృత్తి.. వారిని అమాయక మహిళపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేలా చేసింది. ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో మతిస్థిమితం లేని మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన కామాంధులు కనికరం లేకుండా కర్రలతో చితకబాది ఒక చేయి విరగొట్టారు.
తర్వాత ఆమెను ఇంటి వెనకాలకు లాక్కెళ్లి వివస్త్రను చేసి అత్యాచారం చేశారు. అత్యంత అమానవీయమైన ఈ సంఘటన 10 రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో సైకో ప్రవర్తన ఉన్న వ్యక్తితో పాటు మరో ముగ్గురు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. వనమాల కనపర్తికి చెందిన వివాహిత మహిళకు ఇద్దరు పిల్లలు. 8 ఏళ్ల క్రితం మానసిక వ్యాధికి గురికావడంతో పుట్టింట్లోనే తల్లితో నివసిస్తోంది. (తండ్రి లేడు). పిల్లలు భర్త వద్దే పెరుగుతున్నారు. ఏప్రిల్ 5న శ్రీరామ నవమి రాత్రి గ్రామంలోని యువకులు డీజే సౌండ్తో సీతారాములను ఊరేగిస్తున్నారు. అదేరోజు సాయంత్రం బాధితురాలి తల్లి శుభకార్యానికి హన్మకొండకు వెళ్ళింది. ఇది గమనించిన సైకో బ్యాచ్ (నలుగురు) అర్థరాత్రి మద్యం తాగి బాధితురాలి ఇంటి తలుపుతట్టారు.
గడియ పెట్టుకొని నిద్రిస్తున్న ఆమెను లేపే ప్రయత్నం చేశారు. లేవకపోడంతో రోకలిబండ, ఇతర ఇనుపరాడ్లతో తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అత్యాచారం చేయబోతే ఆమె ప్రతిఘించింది. దీంతో వారు ఆమెను కర్రలతో తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఇంటి వెనుకకు తీసుకెళ్ళి అక్కడ రు. ఒక చేయి విరిగిపోవడంతోపాటు తలకు గాయమై రక్తస్రావమైంది.
అంతేగాకుండా ఆమెను వివస్త్రను చేసి శరీరంపై అనేక గాట్లు పెట్టారు. గదితోపాటు సందులో గోడలకు రక్తం మరకలు అలాగే ఉండిపోయాయి. ఉదయం తెల్లవారాక కొద్ది దూరంలో ఉన్న ఇంటి యజమాని గుర్తించి తల్లికి సమాచారం ఇవ్వగా 108 వాహనం ద్వారా ఎంజీఎంకు తరలించారు. అదే రోజున పోలీస్స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలు జరిగిన సంఘటనను చెప్పడంతో నలుగురిని అందుపులో తీసుకుని ఇద్దరిని వదిలిపెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.
సైకో బ్యాచ్ దుర్మార్గం...
తన కుమార్తెపై అత్యాచారం ఇది రెండవసారని బాధితురాలి తల్లి తెలిపింది. మొదటిసారి జరిగినప్పుడు ఆమె భర్తపై అనుమానం వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇతర వ్యక్తులని తెలిశాక పిటిషన్ వెనుకకు తీసుకున్నారు. తల్లిలేనప్పుడు బాధితురాలిపై లైంగిక దాడి జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. సైకో బ్యాచ్లో ప్రధాన నిందితుడు తన భార్యను చిత్రహింసలకు గురిచేయగా పెళ్లయిన రెండు నెలలకే పుట్టింటికి వెళ్లిపోయింది.
గతంలో ఇతడు బాలికపై అత్యాచారయత్నం చేసి జైలుకు వెళ్లివచ్చాడు. అంతేకాదు చోరీలకు సైతం పాల్పడిన కేసులున్నాయి. మిగిలిన ముగ్గురికి భార్యాపిల్లలున్నా మద్యం వ్యవసనానికి లోనై సైకో చెప్పినట్లు నడుచుకుంటారని తెలిసింది. ఇదిలా వుండగా, సంఘటనపై మడికొండ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.
అత్యాచారం జరిగి పది రోజులవుతున్నా నిందితులను అరెస్టు చేయకపోడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాటుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయమై కాజీపేట ఏసీపీ జనార్ధన్ను వివరణ కోరగా బాధితురాలిని అస్పత్రికి పంపించామని, కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదని తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: సీఐ శ్రీధర్
ఐనవోలు మండల పరిధిలోని వనమాల కనిపర్తిలో ఏప్రిల్ 5న గుర్తుతెలియని వ్యక్తులు ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మడికొండ సీఐ కాసగాని శ్రీధర్ తెలిపారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి ఆమెను గాయపరిచి అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ సోదరుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ మేరకు ఐపీసీ 354 నిర్భయ చట్టం, 457, 324, ఆర్. విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన: ఉపాధ్యాయుడిపై కేసు నమోదు
భీమదేవరపల్లి: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తోటి మహిళా ఉపాధ్యాయులతోపాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆచార్య దేవోభవ అనే అర్థానికే తలవంపులు తెచ్చాడు. భీమదేవరపల్లి మండలం వంగర బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలో మురళి అనే తెలుగు ఉపాధ్యాయుడు 2013 నుంచి కాంట్రాక్ట్ బేసిక్ మీద పని చేస్తున్నాడు.
ఉపాధ్యాయురాళ్ల ఫొటోలు తీయడంతోపాటు వారితో, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతడు తీసిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వారు శుక్రవారం వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వివేక్ పాఠశౄల ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులతో విచారణ జరిపారు. కాగా, మురళిని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల ఆద్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణుకుంట్ల బిక్షపతి, మాట్ల వెంకటస్వామి, మంచాల తిరుపతి, ఎర్ర రాజు, రాజయ్య తదితరులు రెసిడెన్షియల్ పాఠశా ఎదుట శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు.
మురళితోపాటు వహీద్ అనే ఉపాధ్యాయుడిని విధులకు తీసుకోవద్దని పేరెంట్స్ కమిటీ గతంలోనే తీర్మానం చేసింది. కానీ వీరిద్దరిని విధుల్లోకి తీసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు మురళి అసభ్యకరంగా ప్రవర్తించడంతో పేరెంట్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్లో ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కమిటీ నేతలు హెచ్చరించారు.
కాగా, ఇంట్లో భార్యను కొడుతూ సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోలను తమకు చూపెట్టేవాడని విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతూ మీడియా ప్రతినిధులకు తెలిపారు. అతడు పాఠశాలకు వస్తే మేమంతా మూకుమ్మడిగా బడి మానేస్తామని విద్యార్థినులు పేర్కొంటున్నారు. వంగర బాలికల గురుకుల విద్యాలయంలో పురుష ఉపాధ్యాయులు పని చేయవద్దని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఉపాధ్యాయుడిపై కేసు నమోదు
గురుకుల పాఠశాలకు చెందిన మురళి అనే తెలుగు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు వంగర ఎస్ఐ వివేక్ తెలిపారు. మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించాడని పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు, సిబ్బందితో విచారణ జరిపామన్నారు. మురళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ప్రేమ పేరుతో నయవంచన: యువకుడిపై నిర్భయ కేసు
కమలాపూర్: మండల కేంద్రానికి చెందిన 17 సంవత్సరాల బాలికను పెళ్లి చేసుకుంటాంనని చెప్పి శారీక సంబంధం పెట్టుకొని మోసం చేసిన మండలంలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన కనుబోమల రాజేష్పై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, అతడి అన్న రాజేష్, తల్లి రమ, తండ్రి సంజీవయ్యలపై ఎస్సీ, ఎస్టీ అాసిీ కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు తెలిపారు.
రెండు సంవత్సరాల క్రితం బాలిక కమలాపూర్లో పదో తరగతి చదువుతుండగా రాజేష్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ప్రేమ పేరుతో బాలిక వెంట పడ్డాడు. ప్రస్తుతం హన్మకొండ భీమారంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికతో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఇటీవలే అతడికి మరో యువతితో నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న బాలిక తనను పెళ్లి చేసుకోమని రాజేష్ను అడగడంతో నిరాకరించాడు. దీంతో బాలిక తన తల్లిదండ్రుకుల చెప్పడంతో రాజేష్ను, అతడి కుటుంబ సభ్యులను పెద్ద మనుషుల వద్దకు పిలిపించి మాట్లాడారు.
బాలికను వివాహం చేసుకోవాలని కోరగా కులం తక్కువ అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకోవాలని నిరాకరించాడు. బాలికను మోసం చేశారని, కులం పేరుతో అవమాన పరిచారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కాజీపేట ఏసీపీ జనార్ధన్కు అప్పగించామని ఎస్ఐ తెలిపారు.
పెళ్లి ఇంట్లో విషాదం: రాయపర్తిలో వాహనం ఢీకొని పెళ్లికొడుకు అన్న మృతి
వరంగల్: పచ్చని పందిరిలో చావుడప్పు మోగింది. ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో విషాదం నింపింది. అతివేగంగా వచ్చిన వాహనం కన్నీంటిని మిగిల్చింది. రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు అన్న రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందడం కలిచివేసింది. రాయపర్తి ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ వివరాల ప్రకారం... రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన జనగాం కుమారస్వామి (36) వరంగల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
గురువారం తన సోదరుడి వివాహం జరిగింది. శుక్రవారం పెళ్లి విందు కోసం తన బంధువు దంతాలపెల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్తో కలిసి రాయపర్తికి కూరగాయల కోసం వచ్చారు. వాటిని తీసుకుని ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమవగా రాయపర్తి వద్ద జాతీయ రహదారిపై తొర్రూరు నుంచి వరంగల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాస్కు గాయాలు కావడంతో 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతుడికి భార్య కళ్యాణి, కుమారులు శశాంక్, అభిషణ్, తండ్రి మల్లయ్య తల్లి అనసూర్యలు ఉన్నారు.