నోట్ల రద్దు ఎఫెక్ట్ : బ్యాంకు 'క్యూ'లో రిటైర్డ్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ : కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. క్యూ లో గంటల తరబడి నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లో నిలుచున్నా.. డబ్బులు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి.

తాజాగా హైదరాబాద్ లోని మారేడుపల్లిలో ఆంధ్రా బ్యాంకు ముందు క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి ఏకంగా తన ప్రాణాలే కోల్పోయాడు. చాలాసేపటి నుంచి క్యూలో వేచియున్న అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే కన్నుమూశారు.
మృతుడిని మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీ నారాయణగా గుర్తించారు. నగదు మార్పిడి కోసం బ్యాంకుకు వచ్చిన ఆయన దాదాపు రెండు గంటలపాటు క్యూలో నిలబడినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications