తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: రూ. 16వేల కోట్లతో అడ్వెంట్ ఇంటర్నేషన్, కేటీఆర్ హ్యాపీ
హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుస కడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూలో ఉండగా.. మరో దిగ్గజ సంస్థ కూడా ముందుకు వచ్చింది. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ (Advent international) రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దమైంది.
ఈ మేరకు కంపెనీ ఎండీ పంకజ్ పట్వారీ(Pankaj Patwari), సంస్థ ప్రతినిధులు హైదరాబాద్(Hyderabad)లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కేటీఆర్కు వివరించారు.

ఈనేపథ్యంలో తెలంగాణలో ఈ సంస్థ భారీ పెట్టుబడి పెట్టడంపై మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఫార్మా, లైఫ్ సైఫ్సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ వృద్ధికి సంకేమని చెప్పారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.
Ecstatic to share that the leading global private equity firm, @adventintl has chosen Hyderabad as the headquarters for its “Cohance platform,” with a cumulative whopping investment of USD 2 Billion (approx Rs. 16650 Crores) 😊
— KTR (@KTRBRS) September 29, 2023
I had the opportunity to meet with Mr. Pankaj… pic.twitter.com/GbUizWn2fg
కొత్తకోటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్(KTR).ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంటకేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం బుగ్గపల్లితండా వద్ద రూ.425కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తి నియెజకవర్గం రాజాపేట వద్ద 96 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. సురవరం కళాభవన్ పేరుతో నిర్మించిన భవనాన్ని, సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications