మంత్రివర్గ విస్తరణపై మారిన హైకమాండ్ ఆలోచన..!?
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయానికి వచ్చిన పార్టీ హైకమాండ్ కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. కొత్త మంత్రుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సామాజిక - జిల్లా సమీకరణాల ఆధారంగా మంత్రుల లిస్టు ఫైనల్ చేస్తున్నారు. కాగా, తుది ఎంపికలో వస్తున్న తాజా సమస్యలతో పార్టీ నాయకత్వం వ్యూహం మార్చింది. కొత్త ఫార్ములా అమలు చేస్తోంది. దీంతో, తుది జాబితాలో పేర్లు మారే అవకాశం కనిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ మంత్రివర్గ కూర్పులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో జాబితా ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, జాబితాలో ఇంకా మార్పులు చేర్పులు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. అవకాశం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ హైకమాండ్ తుది కసరత్తు చేస్తోంది. కాగా.. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం వివరిస్తూ కొందరు నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, హైకమాండ్ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది.

రేవంత్ ఛాయిస్
ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అన్ని భర్తీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. మంత్రుల పేర్లు ఖరారు తరువాత అవకాశం రాని వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేస్తోంది. అందులో భాగంగానే ఒకటి, రెండు స్థానాలు ఖాలీగా ఉండే లా ఆలోచన చేస్తోంది. నాలుగు స్థానాలు మాత్రమే భర్తీ చేయాలని భావిస్తోంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు 30 మంది పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల నుంచి మంత్రి వర్గంలో అవకాశం కల్పించటం పైన పార్టీ నాయకత్వం పేర్లు సేకరించింది. అందులో భాగంగా సీఎం ఇచ్చిన జాబితాలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు ఉన్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఉత్తమ్ జాబితాలో ఆయ న భార్య పద్మావతి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, దొంతి మాధవరెడ్డి, ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్ పేర్లు ఉన్నట్టు సమాచారం.
తుది జాబితాలో
ఇక భట్టి విక్రమార్క జాబితాలో వాకిటి శ్రీహరి, ప్రేమ్సాగర్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, దొంతి మాధవరెడ్డి పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్లు సమాచారం. సీతకకు హోంమంత్రిగా పదోన్నతి కల్పిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కలిశారు. చివరి నిమిషం వరకు ఆశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా, సామాజిక సమీకరణాల తో పాటుగా జిల్లాల వారీ ఎంపిక సమస్యగా మారుతోంది. దీంతో.. తుది జాబితా పైన పార్టీలో ఉత్కంఠ పెరుగుతోంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications