ఎక్కువ తీసుకుంటున్నారు, వారి లెక్కలో వేయండి: ఏపీ-తెలంగాణ పరస్పర ఫిర్యాదు
హైదరాబాద్: జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ నీరు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా నీటి పైన ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటోందని ఈ నెల 8న తెలంగాణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.
జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ ఎక్కువ నీటిని తీసుకుని లెక్కల్లో చూపడం లేదని ఫిర్యాదు చేస్తూ బుధవారం ఏపీ.. కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. తీసుకొన్న నీటిని చూపడానికి వీలుగా రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరింది.

తెలంగాణ ఫిర్యాదు చేసి కొద్ది రోజులకే ఏపీ ఈ ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా, జూరాల వద్ద కూడా అలాగే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది.
తెలంగాణ ఎక్కువగా వాడుకొన్న నీటిని వారి వాటాలోనే వేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధి నిర్ణయించేవరకు రెండు రాష్ట్రాల అధికారులతో జూరాల, శ్రీశైలం వద్ద సంయుక్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications