ఒంటరి జంటలే లక్ష్యం: యువతిపై అత్యాచారానికి యత్నించిన కీచక జవాన్ అరెస్ట్
హైదరాబాద్: ఒంటరిగా ఉన్న జంటపై దాడిచేసి.. యువతిపై అత్యాచార యత్నం చేసిన ఆర్మీ జవాన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 14రోజుల జైలు శిక్ష విధించారు. జులై 23న తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మూగూడాలో ఇంటర్ చదువుతున్న ఓ యువతి మరో వ్యక్తితో ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ అనే జవాన్ యువతిపై అత్యాచారయత్నం చేశాడు.
అడ్డువచ్చిన ఆ యువకుడిని చితబాదాడు. ఈ మేరకు కేసు విచారించిన పోలీసులు నిందుతుడని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిందితుడు బ్రిజేష్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు సీపీ అంజన్ కుమార్.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ అత్యాచారయత్నం చేసినట్లు ఆధారాలు లభించడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని.. దానిపై మరింతగా విచారించిస్తే ఆ కేసుతో కూడా ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
గతంలో బ్రిజేష్ ఎక్కడెక్కడ పని చేశాడో, అతనికి నేర చరిత్ర ఏమైన ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అంజన్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా, నాలుగు నెలల క్రితం పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై బ్రిజేష్ కుమార్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications