కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీచ్ కమీనే కుత్తేగాడు, తిన్నా పన్నా అదే: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై బాల్క సుమన్

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడోడినని చెప్తడుకానీ, వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పంచన చేరినోడు అని ఆయన అన్నారు.

తిన్నా, పన్నా, లేచినా సీఎం కేసీఆర్ మీదనే రాస్తుంటడని, వాడే రాధాకృష్ణ అని బాల్క సుమన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో ఆదర్శ పాఠశాల, హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు.

Balka suman makes wild comments against Radha krishna

తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు.ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఓ దగుల్బాజీ అని ఆయన అన్నారు. తెలంగాణ బాగుపడుతుంటే చూడలేడని అన్నారు. ప్రతిపక్షాలు అనని మాటలను కూడా అన్నట్లు రాసి ఆనంద పడిపోతున్నడని అన్నారు.

ఆ నీచ్ కమీనే కుత్తేగాడు తిన్నా, పన్నా, లేచినా కేసీఆర్ మీదనే అడ్డంగా రాస్తుంటడని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పతాక శీర్షికలు పెడుతుంటడని వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి పత్రిక విషప్రచారాన్ని నమ్మకుండా ప్రజలంతా కేసీఆర్‌కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Balka suman made wild comments against Andhrajyothy MD Radhakrishna in Karimnagar district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X