ఎంపీ ఇంట్లో భారీ చోరీ: రూ.15లక్షల సొత్తు అపహరణ, సీసీ ఫుటేజీ ధ్వంసం
టీఆర్ఎస్ ఎంపీ నగేష్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం.
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నగేష్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం.
ఎంపీ నివాసంలో ఎవరూ లేని విషయం గమనించిన దొంగలు.. మొదట ఇంటి ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి తాళాలను పగుల గొట్టి లోపలికి వెళ్లారు.

బీరువాలో దాచి వుంచిన రూ.71,000 నగదు, పలు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నగదు, ఆభరణాలు కలిపి మొత్తం రూ.15 లక్షల విలువ ఉన్నట్లు ఎంపీ బంధువులు పట్టణ 1వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎంపీ ఇంట్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఆగస్టు 28న దొంగతనం జరిగిన అనంతరం ఎంపీ ఇంటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని బంధువులు తెలిపారు. కాగా, ఆదిలాబాద్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. క్లూస్ టీంతో వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications