క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా హైదరాబాద్: ఇప్పుడు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారుతోంది. ఇవాళే జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయల్దేరారు. అయితే, ఈసారి బీహార్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చారు. ఇటీవల ఇండియా కూటిమిని వీడిన జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న బీహార్ రాష్ట్రంలోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ రెండు పార్టీలకు ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఉంది. అయినప్పటికీ.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ-జేడీయూ తమవైపు తిప్పుకుంటుందేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రమైన తెలంగాణకు తరలించింది.

బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 18 మందిని హైదరాబాద్కు పంపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వీరు హైదరాబాద్కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. అయితే, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్వరుల్ హక్ మాత్రం వ్యక్తిగత కారణాలతో ఢిల్లీలోనే ఉండిపోయారు. బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్మోహన్ ఝా కూడా హైదరాబాద్కు తరలివచ్చారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోగానే.. వారిని నగర శివార్లలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్టుకు తరలించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం. హైదరాబాద్ వచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బల పరీక్షకు గంటల ముందే ఇక్కడ్నుంచి బీహార్ వెళ్లే అవకాశం ఉంది.
Congress MLAs from Bihar gather at the Hyderabad airport, Telangana.
— Madhav Khurana (@Madhav_khu) February 4, 2024
The floor test of the newly elected NDA government in #Bihar is likely to happen on February 12. pic.twitter.com/EfFSeutWoV
కాగా, బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మెజార్టీకి 122 ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. అయిేత, బీజేపీకి 78 మంది, జేడీయూకు 45 మంది, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16, హెచ్ఏఎం 4, ఎఐఎం 1, ఇండిపెండెంట్ 1 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి బీహార్లో 127 మంది బలం ఉంది. దీంతో బలపరీక్ష నెగ్గడం బీజేపీ కూటమికి ఇతర ఎమ్మెల్యేల అవసరం లేదు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications