ఇక మీ నేతలు ఎందుకు: ఎమ్మెల్యేకు షాకిచ్చిన రైతులు, చేదు అనుభవం
హైదరాబాద్: పెద్దపల్లి శాసన సభ్యుడు మనోహర్ రెడ్డికి సంక్రాంతి రోజున చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందజేయాలని డిమాండ్ చేస్తూ గంగారం గ్రామరైతులు ఆయనను అడ్డుకున్నారు.
సోమవారం సాయంత్రం కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఓ దేవాలయంలో పూజలు చేసేందుకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎమ్మెల్యేను మధ్యలోనే అడ్డుకొని సాగునీరు తమ మండలానికి ఇప్పటి వరకు చేరలేదన్నారు.

ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. సాగునీటిని విడుదల చేస్తామని చెప్పడం వల్లే తాము పంటల సాగు చేపట్టామని, తీరా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టుకు నేటికీ నీరు అందలేదని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
సాగునీటిని కూడా ఇవ్వలేని నేతలు ఎందుకు అని ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనం వెనుక పరుగులు తీశారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ ఎస్సై షేక్ జానీపాషా సమక్షంలో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications