చీడపురుగు: కేసీఆర్పై బాబు మోహన్ నిప్పులు, ‘ఆందోల్లో బీజేపీ జెండా ఎగరేస్తాం’
ఆందోల్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు అని తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్ విమర్శించారు. బుధవారం జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబు మోహన్ ప్రారంభించారు.
అనంతరం బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దళితుల్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని అన్నారు.

బీజేపీకి దళితుడ్ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ఘనత ఉందని బాబు మోహన్ చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మహా మహా రాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండా ఆందోళ్ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ.. డబ్బు, మద్యానికి దూరమని ఆయన చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications