కడియంని కలిసిన కృష్ణయ్య, 'ఓటుకు నోటు' ఉదయ్కు షాక్, ఎక్సైజ్ కస్టడీకి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గురువారం కలిశారు. ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తారని ప్రకటించినందుకుగాను ఆయనకు అభినందనలు తెలిపారు.
అనంతరం కడియం శ్రీహరికి సన్మానం చేశారు. విశ్వవిద్యాలయ హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలని ఆర్ కృష్ణయ్య కోరారు. చార్జీల పెంపు అంశంపై కడియం సానుకూలంగా స్పందించారు.
ఉదయ్ సిన్హాను కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న ఉదయ్ సిన్హాను ఎక్సైజ్ పోలీసులు గురువారం నాడు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు అరెస్టైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వారి నివాసాల్లో పోలీసులు సెర్చ్ చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ సిన్హా నివాసంలో విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో, ఉదయ్ సిన్హాను ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇది ఉదయ్ సిన్హాకు మరో చిక్కు అని చెప్పవచ్చు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications