ఇందూరులో అరవింద్ టికెట్లు అమ్ముకున్నారు, బీజేపీ ఆఫీసు వద్ద శ్రేణుల ఆందోళన
నిజామాబాద్ మున్సిపల్ టికెట్ల కేటాయింపుపై అసంతృప్త నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్, అతని ప్రధాన అనుచరుడు బైసాల లక్ష్మీనర్సయ్య టికెట్లను అమ్ముకొన్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. కొత్త మొహాలకు టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపోల్స్ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఇంచార్జీ కృష్ణ దాస్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారు చర్చిస్తోండగానే.. అసంతృప్త నేతలు నినాదాలతో హోరెత్తించారు. అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారని, ఇది సరికాదని, పార్టీ కోసం శ్రమించిన వారికి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అసంతృప్త నేతల్లో నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు కూడా ఉండటం విశేషం. తనను సంప్రదించకుండానే టికెట్లు ఖరారు చేశారని మండిపడ్డారు. అరవింద్, లక్ష్మీనర్సయ్య కలిసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నామినేషన్ల సమర్పించే గడువు నిన్నటితో ముగిసినందున.. శనివారం వారు ఆందోళన చేపట్టడం విశేషం. విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టిసారించినా.. టికెట్ల కేటాయింపు మార్చలేని పరిస్థితి నెలకొంది
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications