Maoists Mass Surrender: లొంగిపోయేందుకు రెడీ-ముహుర్తం ఫిక్స్-మావోయిస్టుల ప్రకటన..!
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతల్ని పోలీసులు వరుసగా ఎన్ కౌంటర్లతో మట్టుబెడుతున్నారు. అదే సమయంలో భారీ ఎత్తున అరెస్టులు, లొంగుబాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని 15 రోజుల క్రితం ప్రకటించిన మావోయిస్టులు ఇప్పుడు సామూహికంగా లొంగిపోతామని ప్రకటించారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్రం భారీ ఎత్తున ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. దీంతో మావోయిస్టులు ఆయా రాష్ట్రాల్ని వదిలి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తలదాచుకుంటున్నారు. దీంతో తాజాగా మారేడుమిల్లి అడవుల్లో జరిపిన ఎన్ కౌంటర్ లో అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే దేవ్ జీ వంటి వారి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. మరోవైపు ఏపీలోనే తాజాగా 50 మంది మావోయిస్టుల్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

తెలంగాణలోనూ భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న వంటి వారు ఆయుధాలు విడిచి లొంగిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు తమకు కాస్త సమయం కావాలని కోరారు. ఇవాళ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్ ఘడ్(ఎంఎంసీ) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖ విడుదల చేసారు. ఇందులో తాము జనవరి 1న సామూహికంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.

జనవరి 1న తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని పక్కనబెట్టి, ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం సూచించిన రాష్ట్రంలో లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు అనంత్ లేఖలో వెల్లడించారు. అయితే అప్పటి వరకూ ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లు జరగకుండా చూడాలని మాత్రం కోరారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు సంయమనం పాటించాలని వేడుకున్నారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లతో పార్టీ బలహీనమైందని, మిగిలిన వారు లొంగిపోవాలని కేంద్రం కోరడంతో తాము దానికి అంగీకరిస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications