వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా లోకేష్ వద్దు.. అందుకేనా?: రేవంత్‌కు 'నో' చెప్పిన బాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆసక్తికర ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణకు పూర్తిగా కేటాయించేలా చూడాలని వారు కోరారని తెలుస్తోంది. దానికి చంద్రబాబు నో చెప్పారని సమాచారం.

టిడిపిని నిలబెట్టేనా: రేవంత్ వ్యాఖ్యల దుమారం, బీజేపీ ఆగ్రహంటిడిపిని నిలబెట్టేనా: రేవంత్ వ్యాఖ్యల దుమారం, బీజేపీ ఆగ్రహం

తెలంగాణలో టిడిపి పుంజుకుంటుందని, ఆ దిశలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని, 2019లో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇటీవల తెలంగాణ టిడిపి నేతలకు సూచించిన విషయం తెలిసిందే. పలుమార్లు టిడిపి నేతలతో ఆయన మాట్లాడుతున్నారు.

ఈ సందర్భంగా టిటిడిపి నేతలు ఆ ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు చంద్రబాబుతో సమావేశమైన సమయంలో.. తెలంగాణలో టిడిపి క్యాడర్ నిరాశలో ఉందని, వారిలో తిరిగి ఉత్తేజం తెచ్చేందుకు లోకేష్‌ను హైదరాబాదులోనే తెలంగాణకు పూర్తి సమయం కేటాయించేలా చూడాలని కోరారని తెలుస్తోంది. దానికి బాబు సున్నితంగా తిరస్కరించారు.

 Chandrababu says not to Revanth Reddy

తెలంగాణ కోసం ఇద్దరం సమయం కేటాయిస్తామని, పార్టీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని తెలుస్తోంది. తెలంగాణ టిడిపి నేతలతో చర్చ సమయంలో చంద్రబాబు జేఏసీ నేత కోదండరాం పేరును ప్రస్తావించారని తెలుస్తోంది. కోదండ వంటి వారే నిరసన తెలుపుతున్నారని, కేసీఆర్ పాలనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కోదండను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ పైన 'నో' ఎందుకు?

తెలంగాణ ప్రాంతానికి లోకేష్ పూర్తి సమయం కేటాయించేలా చూడమన్న తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు సున్నితంగా నో చెప్పారని, దాని వెనుక ఓ కారణం కూడా ఉండవచ్చునని అంటున్నారు. లోకేష్ పూర్తిగా తెలంగాణకు కేటాయిస్తే, ఏపీ రాజకీయాలలో, నేతలలో ఆయన పైన ఆసక్తి తగ్గుతుందని భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఆందోళన, కోదండరాం ప్రశ్న: కేసీఆర్ దిగొస్తున్నారా?రేవంత్ రెడ్డి ఆందోళన, కోదండరాం ప్రశ్న: కేసీఆర్ దిగొస్తున్నారా?

చంద్రబాబు తర్వాత టిడిపి రాజకీయ వారసుడు లోకేష్ అని తేలిపోయింది. ఇలాంటి సమయంలో లోకేష్ ఏపీని వదిలితే ఆయన నష్టపోతారని, అందుకే ఇద్దరం తెలంగాణకు సమయం కేటాయిస్తామని ఏపీ సీఎం చెప్పి ఉంటారని అంటున్నారు.

English summary
AP CM Chandrababu Naidu says no to Telangana TDP leaders Revanth Reddy, Mothkupalli Narasimhulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X