కీలకంగా చండూర్, టౌన్ బీజేపీకే, గ్రామాలు మాత్రం కమ్యూనిస్టులు
మునుగోడు బై పోల్ ఫలితం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. 9వ రౌండ్, 10వ రౌండ్ ఫలితం బట్టి గెలిచే పార్టీని అంచనా వేయొచ్చు. ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ పార్టీ 3 వేల పైచిలుకు ఓట్లతో లీడ్లో ఉంది. ఇక చండూరు మండలానికి సంబంధించిన ఓట్లు, 9వ రౌండ్.. 10వ రౌండ్లో లెక్కిస్తారు. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలంగా ఉన్న.. గులాబీ పార్టీ కూడా ఆ మేరకు ప్రజలను ఆకట్టుకోగలిగింది.సో.. ఈ మండలాన్ని విజయాన్ని నిర్దేశించనుంది.

బీజేపీ ఆశలపై నీళ్లు..?
నిజానికి బీజేపీ చౌటుప్పల్, చండూర్ మీద ఆశలు పెట్టుకుంది. కానీ చౌటుప్పలు నీళ్లు చల్లింది. 5 నుంచి 6 వేల మెజార్టీ వస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్నారు. కానీ కేవలం 500 ఓట్లే వచ్చాయి. ఇక్కడ అన్ని వృత్తుల వారు ఉండటం.. వారిని టీఆర్ఎస్ పార్టీ చక్కగా మేనేజ్ చేసింది. పథకాలు, అభివృధ్ది అని ఆ పార్టీ నేతలు జనంలోకి వెళ్లారు. వారిని విశ్వసించిన పరిస్థితి ఉంది. చండూరులో కమ్యునిస్టులకు కూడా పట్టు ఉండేది.బీజేపీకి నారాయణ పురంలో కూడా ఆశించిన ఓట్లు రాలేదు.

రాజగోపాల్ వెంట.. అయినా..?
చండూరుకు చెందిన కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీతో నడిచారు. లీడర్ షిప్ క్యాష్ చేసుకున్నారు. మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం లేదు. పుల్లెలం, సిద్దపెల్లి, నిర్మెట తదితర గ్రామాల్లో కమ్యునిస్టుల ప్రభావం ఉంది. ఆ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి క్యాష్ చేసుకుంది. చండూర్, నాంపల్లి, మర్రిగూడెం మండలాలు విజయాన్ని ప్రభావితం చేయనున్నాయి. చండూరును దత్తత తీసుకుంటానని ప్రకటన కూడా టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసింది.

15 వేల మెజార్టీ
ప్రస్తుత ట్రెండ్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ 15 వేల మెజార్టీతో గెలుస్తోందని అంచనాలు వస్తున్నాయి. చండూరులో టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఓట్లు పడితే.. రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటివరకు ఉన్న 3 వేల మెజార్టీ కాస్త.. పెరగనుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు బై పోల్ను ప్రభావితం చేసి ఉంటాయి. అందుకే రాజగోపాల్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications