పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో కీలక పరిణామం - కలిసొచ్చేదెవరికి..!!
తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ముగిసింది. మెజార్టీ సీట్ల గెలుపు పైన మూడు ప్రధాన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సైతం ఈ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ గెలుపును రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఇదే సమయంలో ఈ ఎన్నిక వేళ కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి.
ఆసక్తి కర పోరు
వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక ఆసక్తి కరంగా మారుతోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకే్షరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి తరపున కీలక నేతలు బరిలోకి దిగారు.

మూడు పార్టీల ప్రచారం
గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రుల నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ ఈ ఎన్నికలోనూ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపు కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు.ఈ సీటును దక్కించుకోవడం ద్వారా ప్రశ్నించే ప్రతిపక్షంగా తాము పనిచేస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గెలుపునకు శ్రమిస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ను తమ వైపు తిప్పుకునేందుకు కిషన్రెడ్డి.. వరంగల్, యాదాద్రి జిల్లాలో ప్రచారం చేశారు. ప్రత్యర్థులకంటే మెరుగ్గా పోరాడి మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించాలనే పట్టుదలతో బీజేపీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రులస్థానంలో తమ అభ్యర్థి ప్రేమేందర్ను గెలిపించాలి అని కోరుతున్నారు. మూడు జిల్లాల ఫట్టభద్రులు డిసైడ్ చేసే ఎన్నిక కావటంతో మూడు పార్టీలకు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ గెలుపు పై మూడు ప్రదాన పార్టీలకు సవాల్ గా నిలుస్తోంది. దీంతో..ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications