ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై రేవంత్ కీలక ప్రకటన..!!
ఉద్యోగాల భర్తీ పై ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే 30వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మరో 35 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్ బానిసలయ్యారన్నారు.
ఉద్యోగాలు కల్పించాం
తెలంగాణ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలిపారు. కూడా మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్న తరువాత విద్యార్థుల్లో, ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఎంతో అసంతృప్తిగా ఉందని.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

మూడు నెలల్లోనే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్ బానిసలయ్యారన్నారు. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ''పోలీస్ ఉంటే ఉద్యోగం కాదు.. ఇది ఎమోషన్ , బాగోద్వేగం.. డ్రగ్స్ , గంజాయి, సైబర్ క్రైమ్పై మీరు బలంగా పని చేస్తారని మీ పై పూర్తి విశ్వాసం ఉంది'' అని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజల కుల వృత్తులను ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.
శిక్షణ పూర్తి
దేశ చరిత్రలోనే 18 వేల కోట్లు రూపాయలు కడుపు కట్టుకొని రైతుల అకౌంట్లలో జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడేమి నుండి ఈరోజు 547 సబ్ ఇన్స్పెక్టర్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 లో 401 మంది సివిల్ ఎస్ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యూట్స్, 75 మంది పోస్ట్ గ్రాడ్యూఎట్స్ ఉన్నారు.












Click it and Unblock the Notifications