'మోడీ పెద్ద తుగ్లక్.. రాజీనామా చేయాలి, నోట్ల రద్దుతో 30 లక్షల కోట్ల నష్టం'
ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీలు గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీలు గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోడీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నోట్ల రద్దు కష్టాలు మరో ననాలుగు నెలలు అయినా తీరేలా లేవని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు కారణంగా మూడేళ్లలో 30 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నారు. మోడీ వెంటనే రాజీనామా చేయాలని, నాటి తుగ్లక్ కంటే మోడీనే పెద్ద తుగ్లక్ అ్నారు.
నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'
నోట్ల రద్దు తర్వాత ఎంత నల్లధనం వెలికి తీశారో చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పెద్ద మోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే చిన్న మోడీ తినేస్తున్నారన్నారు. మోడీని ఇంటికి సాగనంపితేనే దేశానికి మంచిది అన్నారు.