అప్పు కింద కూతురి కిడ్నాప్: హెచ్చార్సీకి తల్లిదండ్రుల ఫిర్యాదు
హైదరాబాద్: అప్పు కింద కూతురును కిడ్నాప్ చేసి నిర్బంధించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మంగళవారం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదుచేశారు. స్పందించిన కమిషన్ ఫిబ్రవరి 22లోగా విచారణ నివేదిక అందజేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
మహబూబ్నగర్లోని శ్రీనివాసకాలనీకి చెందిన రాములమ్మ, వెంకటయ్య మాట్లాడుతూ - జాతీయ రహదారి-5 విస్తరణ పనుల్లో భాగంగా కూతురు అరుణ (22)తో కలిసి నెల్లూరు జిల్లాకు 2014 సెప్టెంబర్ 2న వెళ్లి 2015 ఆగస్టు 11వరకు పని చేశామని చెప్పారు.

అక్కడ వీడీబీ ప్రాజెక్టు గుంపు మేస్త్రీ దేవయ్య వద్ద నగదు అడ్వాన్స్గా తీసుకుని బాకీ కింద పని చేశామన్నారు. పనిప్రదేశంలో తాగునీరు, వైద్య సౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడంతో మహబూబ్నగర్కు తిరిగి వచ్చామని చెప్పారు. రూ.96,875 బాకీ ఉండడంతో కూతురును నిర్బంధించారన్నారు.












Click it and Unblock the Notifications