కాంగ్రెస్లోకి డీఎస్?: ఢిల్లీలో కదలికలపై టీఆర్ఎస్ కన్ను, కేసీఆర్ వేటు వేసే ఛాన్స్
Recommended Video

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత డీ శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తెరాసలో తనకు తగిన ప్రాధాన్యత, గ్రూపు రాజకీయాలు తదితర కారణాలతో ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
డీఎస్ తీరు నేపథ్యంలో ఆయనపై పార్టీ అధిష్టానం కూడా వేటు వేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. కొద్ది రోజులుగా డీఎస్ పని తీరుపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమాత్రం సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారని సమాచారం.

డీఎస్ కదలికలపై పార్టీలో అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్లడం, అక్కడే మూడు రోజుల పాటు బస చేయడం, తన కొడుకును బీజేపీలోకి పంపించడం.. వంటి వాటిపై పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications