నేపాల్ భూకంపం: దేవేందర్ గౌడ్ కుమారుడు క్షేమం
న్యూఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్తో పాటు మొత్తం 16 మంది సభ్యుల బృందం గురువారం సురక్షితంగా ఢిల్లీ చేరుకుంది. నేపాల్లో భూకంప బాధితులను ఆదుకునేందుకుగాను ఈ బృందం ఐదు రోజుల కిందట ఆ దేశానికి వెళ్లింది.
సింధుపాల్చౌక్ జిల్లాలోని షౌలే బజార్ గ్రామం కేంద్రంగా స్థానికులకు ఆహారం అందజేస్తోంది. 600-800 మందికి ఉదయం, రాత్రి భోజనాలు వండి పెట్టేవాళ్లమని వీరేందర్ తెలిపారు.
25 రోజులకు సరిపడా సరుకులు తీసుకువెళ్లామని, అయితే రెండోసారి తమ క్యాంపునకు అతి సమీపంలో భూకంపం రావడంతో మరిన్ని రోజులు అక్కడ ఉండటం క్షేమం కాదని స్థానికులు, తమ వాలంటీర్ల కుటుంబ సభ్యులు చెప్పటంతో తిరిగి వచ్చేశామని ఆయన అన్నారు.

బాధితులకు సహాయం పంపించటం కంటే కూడా స్వయంగా వారికి వండి పెట్టడం చాలా సంతృప్తినిచ్చిందని చెప్పారు. వీరేందర్ గౌడ్ బృందం నేపాల్ వెళ్లిన తర్వాత మరోసారి భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో దేవేందర్ గౌడ్ తన కుమారుడిని క్షేమంగా తీసుకురావడానికి సహాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.
దేవేందర్ గౌడ్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ను, పౌర విమానయానాల మంత్రి అశోక్ గజపతిరాజును కలిశారు. వీరేందర్ గౌడ్ బృందం క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications