నేపాల్ భూకంపం: దేవేందర్ గౌడ్ కుమారుడు క్షేమం
న్యూఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్తో పాటు మొత్తం 16 మంది సభ్యుల బృందం గురువారం సురక్షితంగా ఢిల్లీ చేరుకుంది. నేపాల్లో భూకంప బాధితులను ఆదుకునేందుకుగాను ఈ బృందం ఐదు రోజుల కిందట ఆ దేశానికి వెళ్లింది.
సింధుపాల్చౌక్ జిల్లాలోని షౌలే బజార్ గ్రామం కేంద్రంగా స్థానికులకు ఆహారం అందజేస్తోంది. 600-800 మందికి ఉదయం, రాత్రి భోజనాలు వండి పెట్టేవాళ్లమని వీరేందర్ తెలిపారు.
25 రోజులకు సరిపడా సరుకులు తీసుకువెళ్లామని, అయితే రెండోసారి తమ క్యాంపునకు అతి సమీపంలో భూకంపం రావడంతో మరిన్ని రోజులు అక్కడ ఉండటం క్షేమం కాదని స్థానికులు, తమ వాలంటీర్ల కుటుంబ సభ్యులు చెప్పటంతో తిరిగి వచ్చేశామని ఆయన అన్నారు.

బాధితులకు సహాయం పంపించటం కంటే కూడా స్వయంగా వారికి వండి పెట్టడం చాలా సంతృప్తినిచ్చిందని చెప్పారు. వీరేందర్ గౌడ్ బృందం నేపాల్ వెళ్లిన తర్వాత మరోసారి భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో దేవేందర్ గౌడ్ తన కుమారుడిని క్షేమంగా తీసుకురావడానికి సహాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.
దేవేందర్ గౌడ్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ను, పౌర విమానయానాల మంత్రి అశోక్ గజపతిరాజును కలిశారు. వీరేందర్ గౌడ్ బృందం క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications