‘కల్తీ కల్లు మత్తులో రాష్ట్రం-పదవి మత్తులో కెసిఆర్’
హైదరాబాద్: కల్తీ కల్లు మూలంగా రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అబ్కారీ కార్యాలయం ఎదుట కల్తీ కల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పాలన యంత్రాంగం గాడి తప్పడంతో ప్రజల మనుగడ కష్టమైపోయిందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఒంటెద్దు పోకడ అనుసరించడంతో తుగ్లక్ పాలన తలపిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో సిఎం కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
రాష్ట్రంలో కల్తీ కల్లు రాజ్యమేలుతోందని, ప్రజా ప్రతినిధులు, కొందరు అధికారులు కుమ్మక్కై మోతాదుకు మించి కల్తీ చేస్తున్నారని ఆరోపించారు. సదరు కల్తీ కల్లును విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే కల్తీ కల్లు మూలంగా సుమారు నూట యాభై మంది మరణించగా, వందలాది మంది మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాల్లుగా మారి చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీనికంతటికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications