అపరిచితులు ఎవరైనా ఫోన్ అడిగితే ఇస్తున్నారా? అయితే జాగ్రత్త!
సమాజంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి ఏ చిన్న అవకాశం దొరికిన సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలుపు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ కాల్స్ రూపంలో ఎస్ఎంఎస్ ల రూపంలో వాట్సప్ మెసేజ్ ల రూపంలో రకరకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు తాజాగా కొత్త తరహా సైబర్ మోసాలకు తెరతీశారు.
ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలని సైబర్ మోసాలు
ఇక ఈ విషయాన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సీఈఓ అయిన నితిన్ కామత్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. అపరిచిత వ్యక్తులు ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకుని చేస్తున్న సైబర్ మోసాల పైన ఆయన ఒక వీడియోను షేర్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అపరిచిత వ్యక్తులు ఫోన్ అడిగితే జాగ్రత్త అంటున్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీ సిఈవో నితిన్ కామత్
ఇక ఆ వీడియోలో అపరిచిత వ్యక్తులు దగ్గరకు వచ్చి అత్యవసరంగా కాల్ చేసుకోవాలంటూ మీ మొబైల్ ని అడుగుతారు. చాలామంది ఎమర్జెన్సీ కావచ్చు అని భావించి సదుద్దేశంతో సానుకూలంగా స్పందించి వాళ్లకు ఫోన్లను ఇస్తారు. అయితే ఫోన్ తీసుకున్నవారు మీ ఫోన్ కు వచ్చే బ్యాంకింగ్ ఓటీపీలు రాకుండా నియంత్రించి మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు అని మీకు నష్టాన్ని కలిగించి వెళ్తారు అని నితిన్ కామత్ వివరించారు.
Imagine this: A stranger approaches you and asks to use your phone to make an emergency call. Most well-meaning people would probably hand over their phone. But this is a new scam.
— Nithin Kamath (@Nithin0dha) January 15, 2025
From intercepting your OTPs to draining your bank accounts, scammers can cause serious damage… pic.twitter.com/3OdLdmDWe5
అపరిచితులకు ఫోన్లు ఇస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ
ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నమ్మిస్తూనే మన మొబైల్ ఫోన్లలో కొత్త యాప్లను ఇన్స్టాల్ చేసి పర్సనల్ డేటా డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలతో సెట్టింగ్స్ అన్నీ మారుస్తారని, దీనివల్ల మీ ఫోన్ నెంబర్లకు కాల్స్ మెసేజెస్ అలర్ట్ లు రాకుండా చేసి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. అనధికారిక లావాదేవీలు జరిపి మోసాలకు పాల్పడతారని దీనికి సంబంధించి ఒక వీడియోను ఆయన షేర్ చేశారు.
నిజంగా ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్ అయితే ఇలా చెయ్యండి
కాబట్టి ఇటువంటి మోసాల నుంచి కాపాడుకోవడానికి మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి ఫోన్ ఇవ్వమని అడిగితే దయచేసి ఇవ్వద్దని ఆయన సూచించారు. ఒకవేళ నిజంగానే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మీరే వారు చెప్పిన నెంబర్ కు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని వారితో చెప్పాలని సూచించారు. ఇక సైబర్ నేరాలు రోజుకో రకంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు నితిన్ కామత్.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications