అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య
సంగారెడ్డి: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా ఆందోల్ మండల పరిధిలోని నేరడిగుంటలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన ఖాదిరాబాద్ నరేశ్ (30)ను అతడి భార్య అంజమ్మ తన ప్రియుడితో కలిసి రాత్రి హత్య చేసింది.
నరేశ్కు సదాశివపేట సమీపంలో నిజాంపూర్ గ్రామానికి చెందిన అంజమ్మతో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి వినయ్కుమార్, స్వప్న అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేశ్ తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఆటోను కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే అంజమ్మకు అదే గ్రామానికి చెందిన సంగెం శివకుమార్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజుల తరువాత వీరిద్దరి విషయం బయటకు రావడంతో భర్త నరేశ్ ఆమెను మందలించి, పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. ఆమె తన పద్ధతి మార్చుకోకపోగా నరేశ్ను చంపేయాలని తన ప్రియుడు శివకుమార్తో తెలిపింది.
నరేశ్ను హత్య చేసేందుకు ఇద్దరు కలిసి పథకం పన్నారు. అదే గ్రామానికి చెందిన సంగెం మల్లేశం తోడ్పాటును కూడా తీసుకుని, శనివారం రాత్రి నరేశ్ ఎప్పటి మాదిరిగానే ఇంటికి వచ్చి పడుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో సుమారు 11 గంటల ప్రాంతంలో ఆమె ప్రియుడు శివకుమార్, మల్లేశం ఇంట్లోకి ప్రవేశించారు.
ముగ్గురు కలిసి గాఢ నిద్రలో ఉన్న నరేశ్ ముఖంపై ఒకరు మెత్తను పెట్టగా, మరొకరు రెండు కాళ్లను గట్టిగా పట్టుకొగా, మిగతా ఒకరు గొంతు నులిమి హత్య చేశారు.