అందులో నిజం లేదు: దేశపతిని ఘెరావ్ చేయలేదు, వాదన మాత్రమే!
ఈ వాగ్వాదాన్ని ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమానికి ముడిపెట్టి చూడటం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట: బీసీ కమిషన్ సభ్యుడు జూలూరీ గౌరీ శంకర్ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్కు చేదు అనుభవం ఎదురైనట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గం మీద దేశపతి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో కొంతమంది స్థానికులు ఆయన్ను ఘెరావ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే వ్యక్తిగత విబేధాల కారణంగా ఒకరిద్దరు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు తప్పితే.. ఆయన్ను ఘెరావ్ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదంటున్నారు. అంతేకాదు!, దేశపతికి 'రెడ్డి' సెగ తగలగానే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారన్న ప్రచారంలోను నిజం లేదన్నారు.

కార్యక్రమంలో దేవీ ప్రసాద్ పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం వీ6లో జరిగిన ఒక చర్చా కార్యక్రమం రెడ్డి సామాజికవర్గంలో కొంత అసంతృప్తిని రాజేయడం.. ఇలాంటి తరుణంలో దేశపతి శ్రీనివాస్ తో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొంతమంది వాగ్వాదానికి దిగడం.. రెండింటిని ముడిపెట్టి చూసే అంశంగా కనిపించింది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని సిద్దిపేట ప్రజానీకం చెబుతుండటం గమనార్హం. దేశపతి శ్రీనివాస్ కూడా వన్ ఇండియా పోర్టల్కు ఇదే వివరణ ఇచ్చారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications