అందులో నిజం లేదు: దేశపతిని ఘెరావ్ చేయలేదు, వాదన మాత్రమే!
ఈ వాగ్వాదాన్ని ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమానికి ముడిపెట్టి చూడటం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట: బీసీ కమిషన్ సభ్యుడు జూలూరీ గౌరీ శంకర్ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్కు చేదు అనుభవం ఎదురైనట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గం మీద దేశపతి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో కొంతమంది స్థానికులు ఆయన్ను ఘెరావ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే వ్యక్తిగత విబేధాల కారణంగా ఒకరిద్దరు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు తప్పితే.. ఆయన్ను ఘెరావ్ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదంటున్నారు. అంతేకాదు!, దేశపతికి 'రెడ్డి' సెగ తగలగానే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారన్న ప్రచారంలోను నిజం లేదన్నారు.

కార్యక్రమంలో దేవీ ప్రసాద్ పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం వీ6లో జరిగిన ఒక చర్చా కార్యక్రమం రెడ్డి సామాజికవర్గంలో కొంత అసంతృప్తిని రాజేయడం.. ఇలాంటి తరుణంలో దేశపతి శ్రీనివాస్ తో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొంతమంది వాగ్వాదానికి దిగడం.. రెండింటిని ముడిపెట్టి చూసే అంశంగా కనిపించింది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని సిద్దిపేట ప్రజానీకం చెబుతుండటం గమనార్హం. దేశపతి శ్రీనివాస్ కూడా వన్ ఇండియా పోర్టల్కు ఇదే వివరణ ఇచ్చారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications