రోహిత్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!: వర్సిటీలో 'వెలి' నిరసన (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా రోహిత్ కొట్టివేసినట్లుగా భావిస్తున్న 'పేరా' పైన తాజాగా జోరుగా చర్చ సాగుతోంది. ఆ పేరాలో ఏముందనేది తెలుసుకునేందుకు లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
ఆ పేరాను రోహితే కొట్టి వేశాడా? అతనే కొట్టివేస్తే ఏముంది? అనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక వస్తే అందులో ఏముందనే విషయమై బయటపడనుంది.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రోహిత్ తాను పని చేస్తున్న ఆర్గనైజేషన్ పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. ఏఎస్ఐ తదితర సంస్థలో సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారా అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
హెచ్సియు
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
కారెం శివాజీ
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సంఘీభావం తెలిపిన కారెం శివాజీ.
రోహిత్ వేముల
విద్యార్థులను చంపడమే మేకిన్ ఇండియానా.. అని విద్యార్థులు కొందరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్లకార్డులు ప్రదర్శించిన దృశ్యం.
మల్లేపల్లి లక్ష్మయ్య
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సంఘీభావం తెలిపిన మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు.
రోహిత్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్కు నివాళిగా అతని పెయింటింగ్ వేస్తున్న ఓ యువతి.
వెలివాడ
రోహిత్ వేముల మృతి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.