బీజేపీ నేత రాజాసింగ్ ఫేస్బుక్ హ్యాక్ చేసిన దుండగులు: వారిపనేనంటూ ఆరోపణ
హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాకైంది. ఈ క్రమంలో బాధ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ను రాజాసింగ్ సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్బుక్ను హ్యాక్ చేశారని ఆరోపించారు. తనకు తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా 5లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు.

అక్టోబర్ 2న ఓసారి హ్యాకింగ్కు ప్రయత్నించి విఫలమయ్యారని, అక్టోబర్ 7న హ్యాక్ చేశారని రాజాసింగ్ తెలిపారు. ఫేస్బుక్ హ్యాక్ వెనుక ఎంఐఎం నేతలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
గోషామహల్ నుంచి తనని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. అయితే, ఎన్ని కుట్రలు చేసినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications