వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి వాహనం బోల్తాపడి నలుగురు మృతి: పూల కోసం వెళ్లి అక్కాతమ్ముడు

|
Google Oneindia TeluguNews

నల్గొండ: జిల్లాలోని తుర్కపల్లి మండలం మల్కాపురం వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగాచ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Four dead in a Road accident

పూల కోసం వెళ్లి అక్కా తమ్ముడు మృతి

వరంగల్: జిల్లాలోని సంగెం మండలం పల్లారుగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పూల కోసం చెరువులో దిగిన అక్కా తమ్ముడు ప్రమాదవశాత్తు నీటి మునిగి మృతి చెందారు. పల్లారుగూడెం గ్రామానికి చెందిన నాగమణి(8), ఆమె తమ్ముడు సిద్ధు(5) బుధవారం గ్రామ సమీపంలోని ఊర చెరువులో ఉండే అల్లిపూల కోసం చెరువులోకి దిగారు.

చిన్నారులకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటి మునిగిపోయారు. గమనించిన స్థానికులు వారిని బయటికి తీశారు. అప్పటికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాంచన్‌బాగ్‌లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ నగరంలోని కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విజయలక్ష్మి అనే మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

English summary
Four people killled in a road accident occurred in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X