బడ్జెట్లో రూ.లక్ష కోట్లు ఇచ్చారు: జీఎం, పన్ను తగ్గించి.. పరిశ్రమలకు ఊరట
ప్రయాణీకుల భద్రత కోసం రైల్ సంరక్ష కింద బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. చెప్పారు.
హైదరాబాద్: ప్రయాణీకుల భద్రత కోసం రైల్ సంరక్ష కింద బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. చెప్పారు. 2020 నాటికి మానవ రహిత రైల్వే క్రాసింగులు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారన్నారు.
'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'
ప్రయాణీకుల భద్రతకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 3,500 కి.మీ. మేర రైల్వే లైను ప్రకటించారని చెప్పారు.
2019 నాటికి అన్ని రైల్వే కోచ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించారన్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పర్యాటక ప్రాంతాలకు కొన్ని రైళ్లు నడుపుతోందన్నారు.
ప్యాప్సీ స్పందన
కేంద్ర బడ్జెట్ను ఫ్యాప్సీ స్వాగతించింది. జైట్లీ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ అందించారని ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోడీ అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల విషయంలో ఈ బడ్జెట్ ఆశలు రేకెత్తించేలా ఉందన్నారు.
హైదరాబాద్లోని ఫ్యాప్సీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ అంచనాలపై సమావేశం నిర్వహించారు. ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోడీ, ప్రధాన కార్యదర్శి టీఎస్ అప్పారావు, ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.
ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనానికి చట్టం, రైల్వేల్లో సర్వీస్ ఛార్జీలు తొలగింపు
ఈ బడ్జెట్లో పన్ను తగ్గింపు ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన కార్యదర్శి అప్పారావు అన్నారు. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన పరిశ్రమలకు 30శాతం నుంచి 25శాతానికి పన్ను తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ పేర్కొన్నారు.