స్పీకర్ మధుసూదనా చారిని తొలగించాలి: గండ్ర వెంకటరమణా రెడ్డి డిమాండ్
తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి అవినీతిని సొంత పార్టీ నేతలే బయటపెట్టారని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం విమర్శించారు.
వరంగల్: తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి అవినీతిని సొంత పార్టీ నేతలే బయటపెట్టారని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం విమర్శించారు.
స్పీకర్ కుమారులు రాజ్యాంగేతరశక్తులుగా మారారని, దీనిపై సిఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు, మావోయిస్టులతో కోదండరాం కుమ్మక్కయ్యారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు.

కాగా, వరంగల్ రూరల్ జిల్లా తెరాసలో లుకలుకలు బయటపడ్డాయి. స్పీకర్ మధుసూదనా చారి తనకు రూ.48 లక్షలు బాకీపడ్డారంటూ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
గత ఎన్నికల్లో తాను శాయంపేట మండల పరిధిలోని గ్రామాల్లో మధుసూదనాచారి తరఫున రూ.98.58 లక్షలు ఖర్చు చేశానన్నారు. ఇందులో తనకు రూ.50.35 లక్షలు మాత్రమే ఇచ్చారని చెప్పారు.
ఈ మేరకు స్పీకర్ నుంచి తనకు ఇంకా రూ.48.23 లక్షలు రావాలని, వీటిని సత్వరమే తనకు ఇప్పించి న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. అందులో స్పీకర్ తనకు బాకీ పడ్డ లెక్కలను పొందుపరిచారు. ఉన్న భూమంతా అమ్మి 17 ఏళ్లుగా తాను సిరికొండ కోసం ఖర్చుచేశానని, వాటిని తనకు ఇప్పించాలన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications