డిగ్రీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్: నలుగురిపై నిర్భయ కేసు
డిగ్రీ సెకండియర్ చదువుతున్న అమ్మాయిపై ఆమె క్లాస్ మేట్స్ నలుగురు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. వారిపై నిర్భయ కేసు నమోదైంది.
ఖమ్మం: డిగ్రీ సెకండియర్ చదువుతున్న అమ్మాయిపై ఆమె క్లాస్ మేట్స్ నలుగురు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. వారిపై నిర్భయ కేసు నమోదైంది.
ఖమ్మంలో ఈ నెల 1వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఖమ్మంలోని ట్రంక్ రోడ్డులో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడికి డిగ్రీ కాలేజి ఉంది. ఆ అమ్మాయి(17) అందులో డిగ్రీ సెకండియర్ చదువుతోంది.
అఖిల్, రాధాక్రిష్ణ, కార్తీక్, ఉదయ్... వీరంతా ఆ అమ్మాయి క్లాస్ మేట్స్. అఖిల్తో ఆమె క్లోజ్గా ఉండేది. అఖిల్కు మిగతా ముగ్గురు స్నేహితులు. ఈ నెల 1వ తేదీన తన పుట్టిన రోజని, తన గదిలో బర్త్ డే పార్టీ ఇస్తానని, రావాలని ఆ అమ్మాయికి, మిగిలిన ముగ్గరు స్నేహితులకి రాధాక్రిష్ణ చెప్పాడు. వారు సరేనన్నారు.
ఆ అమ్మాయిని అఖిల్ తీసుకు వెళ్లాడు. మిగతా ఇద్దరు కూడా రాధాక్రిష్ణ గదికి వచ్చారు. కాలేజీకి దగ్గరలో గల పీఎస్ఆర్ రోడ్డులోని ఆ గదిలో అందరూ పార్టీ చేసుకున్నారు.
ఆ తర్వాత ఆమెపై రాధాక్రిష్ణ, అఖిల్, ఉదయ్ లైంగిక దాడి చేశారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆమె ఏడుస్తూ ప్రతిఘటించింది. బతిమలాడుకుంది. అయినా వారు వినలేదు.
Recommended Video
తన స్నేహితులు లైంగిక దాడి చేస్తుండగా కార్తీక్ తన సెల్ ఫోనుతో వీడియో తీశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడు. అక్కడ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోను యూట్యూబ్లో పెడతామని బెదిరించారు.
రెండు రోజులపాటు అమ్మాయి మౌనంగా ఉంది. ఆమె డల్గా ఉండడాన్ని తల్లి గుర్తించింది. నెమ్మదిగా ఆరా తీసింది. ఆ అమ్మాయి ఏడుస్తూ.. విషయం చెప్పింది.
కూతురిని తీసుకుని ఆ తల్లి ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అఖిల్, రాధాక్రిష్ణ, ఉదయ్, కార్తీక్ పై నిర్భయ, లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురిలో ముగ్గరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఒకడు పరారీలో ఉన్నాడని తెలిసింది.