హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపద్ధర్మ సీఎం వద్దు: విపక్షాలకు 11న గవర్నర్ అపాయింట్‌మెంట్, ‘పొత్తులపై టీపీసీసీ కమిటీ’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ అఖిల పక్షానికి సెప్టెంబర్ 11న అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఎల్ రమణ అపాయింట్‌మెంట్‌ అడిగిన విషయం తెలిసిందే.

ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ వద్దు: గవర్నర్‌కు ఫిర్యాదు, తెలంగాణకు ఈసీ ప్రతినిధులు!ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ వద్దు: గవర్నర్‌కు ఫిర్యాదు, తెలంగాణకు ఈసీ ప్రతినిధులు!

ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొనసాగించొద్దని గవర్నర్‌కు విన్నపం చేయనున్నాయి విపక్షాలు. అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4గంటలకు విపక్ష నేతలు గవర్నర్‌ను కలవనున్నాయి.

Governor Narasimhan gives appointment to Telangana Opposition Parties

పొత్తులపై టీపీసీసీ కమిటీ

Recommended Video

కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పొత్తులపై చర్చలకు గాను టీ-పీసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కమిటీ సమావేశం కానున్నట్టు సమాచారం.

English summary
Governor Narasimhan gives appointment to Telangana Opposition Parties on 11th September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X