నరేంద్ర మోడీ ఎఫెక్ట్: కేసీఆర్ 'స్వీట్' షాక్, కేంద్రమంత్రికి హరీష్ లేఖ
రేషన్ చక్కెర పైన సబ్సిడీని కేంద్రం ఉపసంహరించుకుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారంతెలిపారు.
హైదరాబాద్: రేషన్ చక్కెర పైన సబ్సిడీని కేంద్రం ఉపసంహరించుకుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారంతెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదని చెప్పారు.
తద్వారా రేషన్ షాపుల్లోను చక్కెర ధర ఇక నుంచి తక్కువ ధరకు రాదని స్పష్టం చేశారు. ఇకపై రేషన్ షాపుల ద్వారా చక్కెర సరఫరాకు అవకాశం లేదన్నారు. కేంద్రం నిర్ణయంతో రేషన్ దుకాణాల్లో చక్కెర ధర బహిరంగ మార్కెట్తో సమానమవతుందన్నారు. ఆయన గురువారం పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు.
కేంద్రమంత్రికి హరీష్ రావు లేఖ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్కు తెలంగాణ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మార్కెట్ జోక్యం పథకం కింద మిర్చి క్వింటాలు రూ.7 వేలకు కొనుగోలు చేయాలని ద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మంచి నాణ్యతతో ఉన్న మిర్చికి ఇప్పటికే రూ.5వేలకు పైగా ధర పలుకుతోందని.. ఈ నేపథ్యంలో రూ.5వేలకు క్వింటాలు మిర్చి కొనుగోలు చేయాలన్న కేంద్ర నిర్ణయం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
కేవలం 33, 700 మెట్రిక్ టన్నుల మిర్చి కొనుగోలుకు మాత్రమే అనుమతిచ్చారని, ఇంకా రైతుల వద్ద మూడు లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉన్నందున ఆ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సేకరణ గడువును కూడా జూన్ నెలాఖరు వరకు పెంచాలన్నారు.