ముందు అవగాహన కల్పించండి, తర్వాతే హెల్మెట్ రూల్: హైకోర్టు
హైదరాబాద్: ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు చేయాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
అయితే హెల్మెట్ వాడకం జరిగేలా చూడాలని న్యాయస్థానం సూచించింది. హెల్మెట్ లేని వాహనదారులపై 92,164 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు 92,164 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
వాహనదారులకు 15 రోజులపాటు హెల్మెట్ వినియోగంపై చైతన్యం కల్పించాలని, ఆ తర్వాత హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలపాటు వాయిదా వేసింది.

9న తెలంగాణ భాషాదినోత్సవం జీవో జారీ
సెప్టెంబర్ 9న తెలంగాణ భాషాదినోత్సవం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించనున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జిల్లా కేంద్రాల్లో కాళోజీ చిత్ర ప్రదర్శన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ భాషలో నవలలు, నాటకాలు, కవిత్వంపై పోటీల నిర్వహణ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో కాళోజీ జీవితం, కవిత్వంపై చర్చ జరగనుంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications