తెలంగాణ సర్కారుకు మరో షాక్: టీఆర్టీ నోటిఫికేషన్ సవరించాల్సిందేనన్న హైకోర్టు
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్టీకి సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనని స్పష్టం చేసింది. తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉన్నందునా.. ఉద్యోగా
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్టీకి సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనని స్పష్టం చేసింది.
తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉన్నందునా.. ఉద్యోగాల భర్తీకి 31జిల్లాలను పరిగణలోకి తీసుకోవద్దని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో, 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురు హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అంతకుముందు బుధవారంనాటి విచారణలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదిస్తూ.. పరీక్షల నిర్వహణను అడ్డుకునేలా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications