హైదరాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు: మొదట బెంగళూరుకే!, మరో నగరానికి కూడా?
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) నుంచి మరో వందేభారత్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందు కోసం రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)కు కొత్త రైలును నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పర్యటన సందర్భంగానే హైదరాబాద్-బెంగళూరు వందేభారత్(Vande Bharat) రైలు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు పలు జాతీయ మీడియా ఛానళ్లు కూడా కథనాలు వెల్లడించాయి. అయితే, ఏ తేదీన మరో కొత్త వందేభారత్ రైలు ప్రారంభిస్తారనే విషయం మాత్రం స్పష్టత రాలేదు. ఈ కొత్త రైలు కార్యరూపం దాల్చితే తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే మూడో వందేభారత్ రైలు ఇదే కానుంది.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతిలకు రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ కొత్త వందేభారత్ రైలుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కాచిగూడ నుంచి బెంగళూరుకు ఇప్పటికే పలు రైళ్లు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్-బెంగళూరు 570 కిలోమీటర్ల మార్గాన్ని ఈ రైళ్లు దాదాపు 11 గంటలపాటు ప్రయాణించి చేరుకుంటున్నాయి.
అయితే, హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ రైలు ప్రారంభమైతే.. దాదాపు నాలుగు గంటల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రారంభించిన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ప్రారంభిస్తే అంతకుమించిన జనాదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బెంగళూరులో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక బీజేపీ నేతలు కూడా ఈ వందేభారత్ రైలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమచారం. త్వరలోనే ఈ వందేభారత్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతున్న పుణెకు మరో వందేభారత్ రైలు నడపాలని రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం.
-
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications