తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఎప్పుడంటే?
వచ్చే వర్షాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం కంటే అధిక వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదువుతుందని తెలిపింది.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంపై హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాలు వెల్లడించింది. జూన్-సెప్టెంబర్ నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఎల్ నినో పరిస్థితులు జూన్ నాటికి పూర్తిగా బలహీన పడతాయి. లా నినా పరిస్థితులు జులైలో పుంచుకుంటాయి.

ఈ నేపథ్యంలోనే నైరుతి రుతుపవనాలు జూన్ 8, 11వ తేదీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఆగస్టులో సాధారణ రీతిలో కొనసాగుతూ.. తిరిగి సెప్టెంబర్లో అధికంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది.
గత ఏడాది రుతపనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదుకావడంతో సాగుకు విఘాతం కలిగింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకుని క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ఏడాది మాత్రం అలా ఉండదని, వానలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications