వసంత, నార్నే..! అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా, 39 ఎకరాలకు విముక్తి
అక్రమ నిర్మాణాపై హైడ్రా మరోసారి విరుచుకుపడింది. హైదరాబాద్ మియాపూర్లోని హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లో ఉన్న 39 ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూములలో
ఆక్రమణలను తొలగించింది. దీంతో అఫీజ్పేట, రాయదుర్గంలో రూ. వందల కోట్ల విలువైన భూమికి విముక్తి లభించింది.
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడ్డాయి బడా నిర్మాణ సంస్థలు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ, కొండపూర్లోని ఆఫీజపేట సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి.

సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరు 79/1 గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది వసంత హోమ్స్ సంస్థ. అంతేగాక, ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసి.. ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు.. పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చింది వసంత హౌస్ నిర్మాణ సంస్థ.
ఈ భూములపై సుప్రీం కోర్టులో చాలా కాలంగా సి.ఎస్.14/58 అనే వాజ్యం పెండింగ్లో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చింది. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకాకుండా నిర్మాణాలు చేసింది.
ఫైనల్ డక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని పై వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా విస్మయం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాల తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా.
యువత ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా
తాము రోజూ ఆడుకునే చోట ఆడనివ్వడంలేదని.. అక్కడ చెరువును కూడా మాయం చేస్తున్నారని.. రహదారులు నిర్మిస్తున్నారని అక్కడ క్రికెట్ ఆడుకునే యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా . షేక్పేట మండలం రాయదుర్గం దర్గా దగ్గరలోని సర్వే నెంబర్ 5/2లో క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 39 ఎకరాలవరకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు నిర్ధారించింది.
ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టారు ఆక్రమణదారులు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు చేస్తోంది నార్నే ఎస్టేట్స్ సంస్థ. హఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు ఏర్పాటు చేసింది హైడ్రా. ఆక్రమణ దారులపై పోలీసు కేసు నమోదు చేయించింది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications