ఆయన తప్ప ఎవరూ నన్ను ఓడించలేరు
తనను ఓడించే శక్తి ఎవరికీ లేదన్నారు మిర్యాలగూడ ఎంఏల్ఏ భాస్కర్ రావు. జానారెడ్డి కేంద్రీకరించి పనిచేస్తే మిర్యాలగూడలో తాను ఓటమి చెందుతానన్నారు.
హైదరాబాద్ :ఆయన తప్ప నన్నెవరూ ఓడించలేరని మిర్యాలగూడ ఎంఏల్ఏ భాస్కర్ రావు ధీమాను వ్యక్తం చేశారు.తనను సిఎల్ పి నాయకుడు జానారెడ్డి తప్ప ఇతరులెవరూ కూడ ఓడించేల శక్తి లేదన్నారు. అయితే జానారెడ్డిని ఓడించే శక్తి తనకు ఉందన్నారు.అయితే ఆయనను ఓడించాలనే ఉద్దేశ్యం మాత్రం తనకు లేదన్నారాయన.
తాను ఓటమి పాలైన, సీటు కోల్పోయినా జానారెడ్డికి మాత్రం వ్యతిరేకంగా పనిచేయబోనని మిర్యాలగూడు ఎంఏల్ఏ భాస్కర్ రావు చెప్పారు. నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో చర్చ సందర్భంగా నల్గొండ ఎంఏల్ఏ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మిర్యాలగూడ ఎంఏల్ఏ భాస్కర్ రావు మధ్య వాగ్వావాదం చోటుచేసుకొంది.అయితే ఈ సందర్భంగా ఇద్దరూ ఎంఏల్ఏలు పరస్పరం సవాళ్ళు విసురుకొన్నారు.
రాజీనామా చేసి మిర్యాలగూడ స్థానం నుండి భాస్కర్ రావు పోటీచేస్తే డిపాజిట్టు కూడ దక్కదన్నారు.అయితే ఈ సవాల్ కుభాస్కర్ రావు కూడ ఘాటుగానే స్పందించారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీచేస్దే ఎవరు గెలుస్తారో తేలుతోందన్నారు.
ఈ సవాల్ విషయమై అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులు మిర్యాలగూడ ఎంఏల్ఏ బాస్కర్ రావును ప్రశ్నించారు.అయితే ఇంకా ఎటూ తేలలేదని ఆయన చెప్పారు. అయితే తనను మిర్యాలగూడ నియోజకవర్గంలో ఓడించే శక్తి జానారెడ్డికి ఒక్కరికే ఉందన్నారు. పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాని, నల్గొండ ఎంఏల్ఏ వెంకట్ రెడ్డికి గాని లేదన్నారు భాస్కర్ రావు.
జానారెడ్డి పట్టుదలగా పనిచేస్తే మిర్యాలగూడ నియోజకవర్గంలో తాను ఓటమిపాలయ్యే అవకాశం ఉంటుందన్నారు భాస్కర్ రావు. జానారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంంలో తనకు రెండు మండలాల్లో పట్టుందని భాస్కర్ రావు చెప్పారు.
ఈ మండలాల్లో తనకు సమీప బంధువులే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా ఉన్నారని ఆయన చెప్పారు. అయినా జానారెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఆలోచన తనకు లేదన్నారు భాస్కర్ రావు.2014 సాధారణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.ఇటీవలే ఆయన టిఆర్ఎస్ లో చేరారు.