రైలు ప్రయాణీకులకు అలర్ట్ - టికెట్ బుకింగ్ లో మార్పులు..కొత్తగా..!!
రైల్వే టికెట్ బుకింగ్ కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.
రైల్వే ప్రయాణీకులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. రైల్వే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలు ప్రస్తుతం ఐఆర్సీటీసీ ద్వారా అందుబాటులో ఉన్నాయి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ఉన్నా.. ఎక్కవ శాతం ప్రయాణీకులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారానే టికెట్ బుకింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. తత్కాల్.. రద్దీ సమయాల్లో ఈ వెబ్ సైట్ ద్వారా టికెట్ బుకింగ్ లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని రైల్వే బుకింగ్ సేవల్లో కొత్త సదుపాయాలను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొస్తోంది.

వాయిస్ ఈటికెటింగ్ వ్యూచర్
ఐఆర్సీటీసీ త్వరలో ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ బెస్ టూ వాయిస్ ఈటికెటింగ్ వ్యూచర్ను ప్రవేశ పెట్టనుంది. ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ ఆధారిత చాట్ బాట్ వ్యూచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త విధానంలో టికెట్ బుకింగ్ కు అవకాశం కలుగుతుంది. అందులో భాగంగా ఇక నుంచి ఐఆర్సీటీసీ లాగిన్ కావడానికి ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం అవసరం ఉండదు. ప్రయాణీకుడి ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీల తో అవసరం లేకుండా కొత్త విధానంలో టికెట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఇందులో కేవలం వాయిస్ ద్వారా రైలు టికెట్స్ను బుక్ చేసుకోనే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీచర్ వినియోగం సమయంలో టికెట్ బుక్ చేసుకొనే ప్రయాణీకుడు హిందీ లేదా ఇంగ్లీషు భాషలో సమాచారం పొందే వెసులుబాటు ఉంటుంది. సమాధానాలు లభిస్తాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద పరిశీలన
ఈ ఫీచర్ లో టికెట్ బుకింగ్ తో పాటుగా టికెట్ రద్దు అవకాశం కూడా ఉంటుంది. టికెట్ డబ్బులు తిరిగి ప్రయాణీకుడి ఖాతాలో చేరే వరకూ స్టేటస్ ను రైల్వే టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొనే వెసులుబాటు ఉంది. సాధారణ టికెట్ బుకింగ్ సమయంలో ఉండే అన్ని ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఫీచర్ లో మాత్రమే మార్పు ఉంటుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ విధానం అమలుకు నిర్ణయించారు. ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా నిర్ణయించారు. దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో డిజిటల్ ఇంటరాక్షన్ టూ సీటు హెల్ప్ ఎనీ టైమ్పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలో విజయవంతం కావడంతో.. మలిదశ టెస్టింగ్ను మరింత వేగవంతం చేయనుంది.

ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్స్ ఆధారిత సేవలు
దీని పైన అన్ని స్థాయిలో టెస్టింగ్ పూర్తయిన తరువాత ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఆర్సీటీసీ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తోంది. అదే సమయంలో ఈ విధానం ద్వారా అదనపు ఛార్జీల భారం లేకుండా చూడాలనే సూచనలు అందుతున్నాయి. దీని కోసం సాంకేతికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎక్కడా అంతరాయం లేని సేవలు అందించే విధంగా ఈ ఫీచర్ కు తుది రూపు ఇస్తున్నారు. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications