Kamareddy: వారిని కాపాడబోయి ఎస్సై సాయి కుమార్ మృతి..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎస్సై, కానిస్టేబుల్, యువకుడి ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎస్సై సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని తెలుస్తోంది. కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ కాపాడడానికే సాయి కుమార్ చెరువులోకి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు బృందం నీటిలో దిగి నీటి శాంపిళ్లను సేకరించింది. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వచ్చే మార్గంలో సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు.
వాటిని విశ్లేషిస్తున్నారు. ఎస్ఐ వాహనానికి సంబంధించి సైడ్ డోర్ గ్లాసులకు బ్లాక్ పేపర్ ఉండటం వల్ల అందులో ఎవరెవరు ఉన్నారన్నది సీసీ ఫుటేజ్ లో సరిగా కనిపించడం లేదని సమాచారం. సాయి కుమార్ బుధవారం భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం 11:30 గంటలకు తన సొంత కారులో బయటకు వచ్చారు. కానిస్టేబుల్ శృతిని, బీబీపేట సొసైటీలో పనిచేసే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ను పొందుర్తి శివారులో కారు ఎక్కించుకున్నట్లు తెలిసింది.

వారులో కారులో కొద్దిసేపు మాట్లాడుకున్నారని.. ఆ తర్వాత గాంధారి ఎక్స్ రోడ్ వద్ద దించడానికి సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి సమీపంలో ఉన్న చెరువు నుంచి వెళ్లాలని సాయి కుమార్ భావించాడు. ఈ క్రమంలోనే చెరువు వద్ద రాగానే.. శృతి ఆవేశంగా వెళ్లి చెరువులో దూకినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత నిఖిల్ కూడా చెరువులోకి దూకగా.. వారిని కాపాడేందుకు ఎస్సై సాయి కుమార్ సైతం చెరువులో దూకినట్లు తెలుస్తోంది.
చెరువులో లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఎస్సై సాయి కుమార్ ఫోన్ లో శృతి తో చాటు చేసినట్లు తెలిసింది. అలాగే నిఖిల్, శృతి కూడా చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాటింగ్ లో ఇద్దరు కలిసి చనిపోదామని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్సై సాయి కుమార్ శృతితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం భార్య మహాలక్ష్మి తెలియడంతో ఆమె ఊరు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణ రెండు మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications