బిచ్చగాళ్లమా, కెసిఆర్కు మేమే బట్టలు, బిర్యానీ పంపిస్తాం: మత్తయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన జెరూసలేం మత్తయ్య సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ క్రైస్తవు సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే ప్రభుత్వం క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తోందన్నారు.
క్రైస్తవులు బిచ్చగాళ్లు కాదని, తామే కెసిఆర్కు దుస్తులు, బిర్యానీ ప్యాకెట్లు పంపిస్తామని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్వహించే క్రైస్తవ వేడుకలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. క్రైస్తవులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

కాగా, క్రిస్మస్ పండుగ నేపథ్యంలో రెండువేల మంది క్రైస్తవులకు దుస్తులు తదితరాలను పంపిణీ చేస్తామని, ఈ పండుగ తరఫున నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత్తయ్య ముఖ్యమంత్రి పైన మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలుగు రాష్ట్రాలలో కొద్ది నెలల క్రితం సంచలం రేపాయి. ఓటుకు నోటు కేసులో మత్తయ్య నిందితుడు. ఇరువురు సీఎంలు కలిసిపోవడం వెనుక తన ప్రయత్నమే ఉందని మత్తయ్య కొద్ది రోజుల క్రితం చెప్పారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications