2019లో బిజెపియే: మోడీని కాపీ కొడుతున్న కెసిఆర్, ఇదిగో..!
ఇందూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న పథకాలను కాపీ కొడుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష ఉపనేత ఎన్వీవీఎస్ ప్రభాకర్ గురువారం నిజామాబాద్ జిల్లాలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కాపీ కొడుతున్నారని చెప్పారు.
మోడీ డిజిటల్ ఇండియాను రూపొందిస్తే, డిజిటల్ తెలంగాణతో కెసిఆర్ ముందుకు వచ్చారని, అలాగే, గ్రీన్ ఇండియా అని కేంద్రం అంటే హరితహారం అని కొత్త పేరు పెట్టి మోడీ మార్కును అనుసరిస్తున్నారని చెప్పారు. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభిస్తే, కెసిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ అన్న విషయం తెలిసిందే.

కెసిఆర్ పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రభాకర్ మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు తెరతీసిన అధఇకార పార్టీ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటోందని ధ్వజమెత్తారు. వలసలను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందన్నారు.
2019 ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే రాష్ట్రంలో ప్రధానంగా పోటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదుగుతోందని చెప్పారు. ఆన్ లైన్ సభ్యత్వం పూర్తయిన తర్వాత గ్రామగ్రామానికి వెళ్లి బిజెపిని బలోపేతం చేస్తామన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications