కెసిఆర్కు హైసెక్యూరిటీ వెహికిల్: అన్ని హంగులతో వైఫై
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోసం అధునాతన హంగులతో హై సెక్యురిటీ వెహికిల్ సిద్ధమైంది. చండీగఢ్లో తయారైన ఈ వాహనం హైదరాబాదు చేరుకుంది. దీని తయారీకి మూడు నెలల కాలం పట్టినట్లు సమాచారం.
జిల్లాల పర్యటనకు కెసిఆర్ ఈ వాహనాన్ని వాడుతారు. ఈ వాహనం ప్రయాణానికి అత్యంత సౌకర్యంగా ఉండడమే కాకుండా అన్ని సౌకర్యాలు వాహనంలో ఉంటాయి. వైఫైతో పాటు అత్యధునాతన టెక్నాలజీ కూడా ఈ వాహనంలో ఉంటుంది. అధికారులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే సౌకర్యం కూడా ఈ వాహనంలో ఉంటుంది.
హైదరాబాదు వచ్చిన ఈ వాహనాన్ని కెసిఆర్ పరిశీలించే అవకాశం ఉంది. కెసిఆర్ పరిశీలించిన తర్వాత అవసరమైతే మార్పులు చేర్పులకు సూచనలు చేస్తారని అంటున్నారు. మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే ఆయన దీన్ని వాడుతారు.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇండియా గాడ్జెట్ ఎక్స్పో బ్రోచర్ విడుదల చేశారు. హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పోస్టర్ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 18 నుంచి ఇండియా గాడ్జెట్ ఎక్స్పో మాదాపూర్లో కొనసాగనుంది.