టీజేఏసీ ఛైర్మన్ పదవికి కోదండరాం రాజీనామా: ఇక టీజేఎస్లోనే
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ(జాయింట్ యాక్షన్ కమిటీ) ఛైర్మన్ పదవికి ప్రొఫెసర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి రాజీనామా పత్రాన్ని జేఏసీ కన్వీనర్ రఘుకు అందజేశారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ జనసమితిలో చేరుతున్నందున జేఏసీ అధ్యక్ష పదవిని శనివారం నుంచి వదిలేస్తున్నట్టు చెప్పారు. అప్పటి స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు జేఏసీ అధ్యక్ష పదవి స్వీకరించానని తెలిపారు. జేఏసీలో లేకున్నా తమ సహకారం ఉంటుందని తెలిపారు.
2009 నుంచి సహకరించిన వారందరికీ కోదండరాంకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జనసమితిలోనూ ఇంతకు ముందు పాత్రే పోషిస్తానని స్పష్టం చేశారు. ఇక నుంచి జేఏసీ బాధ్యతలను ప్రస్తుత కన్వీనర్ రఘు నిర్వహిస్తారని చెప్పారు. జేఏసీ అధ్యక్షుడ్ని స్టీరింగ్ కమిటీ ఎన్నుకుంటుందని కోదండరాం తెలిపారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications