టీజేఏసీ ఛైర్మన్ పదవికి కోదండరాం రాజీనామా: ఇక టీజేఎస్లోనే
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ(జాయింట్ యాక్షన్ కమిటీ) ఛైర్మన్ పదవికి ప్రొఫెసర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి రాజీనామా పత్రాన్ని జేఏసీ కన్వీనర్ రఘుకు అందజేశారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ జనసమితిలో చేరుతున్నందున జేఏసీ అధ్యక్ష పదవిని శనివారం నుంచి వదిలేస్తున్నట్టు చెప్పారు. అప్పటి స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు జేఏసీ అధ్యక్ష పదవి స్వీకరించానని తెలిపారు. జేఏసీలో లేకున్నా తమ సహకారం ఉంటుందని తెలిపారు.
2009 నుంచి సహకరించిన వారందరికీ కోదండరాంకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జనసమితిలోనూ ఇంతకు ముందు పాత్రే పోషిస్తానని స్పష్టం చేశారు. ఇక నుంచి జేఏసీ బాధ్యతలను ప్రస్తుత కన్వీనర్ రఘు నిర్వహిస్తారని చెప్పారు. జేఏసీ అధ్యక్షుడ్ని స్టీరింగ్ కమిటీ ఎన్నుకుంటుందని కోదండరాం తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications