హైకోర్టును ఆశ్రయించిన కొండా .. ముందస్తు బెయిల్ ఇక్కడైనా దొరికేనా ?
కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ముందస్తు బెయిల్ను నిన్న నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ నేపధ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ వారంట్ జారీ అయింది. దీంతో అజ్ఞాతంలో ఉన్న కొండాకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ తిరస్కరించి షాక్ ఇవ్వటంతో హైకోర్టును ఆశ్రయించారు కొండా .
లంచావతారాలు ...ఏసీబీ ట్రాప్ లో పడిన ఇద్దరు ప్రభుత్వాధికారులు
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయనను పట్టుకోలేకపోయారు . నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించటంతో ,బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా , కొండా అరెస్ట్ తప్పదా అన్నది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ సమయంలో శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . మరి హైకోర్టులో అయినా ఆయనకు ముందస్తు బెయిల్ దొరుకుతుందా లేకా కింది కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్దిస్తుందా అన్నది తెలియాల్సి వుంది.