రెండేళ్లు ఓపిక పట్టండి, కాలర్ పట్టుకోండి

తెలంగాణలో పంటల కొనుగోలులో ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జొన్న రైతు పాండురంగ వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించిన కేటీఆర్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

మరణించిన పాండురంగ ఆదర్శ రైతు అని, ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 3,720 లభిస్తుందనే ఆశతో ఆ రైతు దాదాపు నెల రోజుల పాటు మార్కెట్ యార్డులోనే తన జొన్నల కుప్ప వద్ద పడిగాపులు కాశారని వివరించారు. చివరకు క్వింటాల్‌కు రూ. 50 లంచం అడిగే దుస్థితి రావడంతో తీవ్ర ఆవేదన చెందారని గుర్తుచేస్తూ కన్నీరు పెట్టారు.

KTR Message to Farmers in Adilabad says Grab Hope for Next Two Years KCR Will Care for You

చివరికి అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన పాండురంగ, తానే ఎంతో కష్టపడి పండించిన పంట కుప్పపైనే విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యవసాయ రంగ దయనీయ పరిస్థితికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. రూ. లక్షన్నర గల ఆయన పంట రుణంలో కనీసం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు.

కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రూ. 500 బోనస్ ఇవ్వకపోగా, ప్రైవేటు మార్కెట్ లో క్వింటాల్ రూ. 2,000 తక్కువ ధరకు అమ్ముకునేలా పరిస్థితి సృష్టించిందని ఆరోపించారు. ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని, రైతు బీమా ప్రీమియంలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు పెండింగ్‌లో పడ్డాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రైతుల మరణాలు సాధారణ ఆత్మహత్యలు కావని, ఇవి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి రథసారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని కేటీఆర్ ఆరోపించారు.

దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పాండురంగ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే చదువుకుంటున్న ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతను తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైతులెవరూ తీవ్ర నిర్ణయాలు తీసుకుని తమ కుటుంబాలను అనాథలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకపోతే నాయకుల కాళ్లు పట్టుకోవడం మానేసి, వారి కాలర్ పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఆపదలో ఉన్న రైతులకు బీఆర్ఎస్ పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రానున్న రెండు సంవత్సరాల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వస్తుందని, ప్రతి ఒక్క రైతన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. అంతవరకు కాంగ్రెస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+