ఆడుకొనే సమయం తగ్గించిందని నానమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు
తనకు ఆడుకొనే సమయాన్ని బాగా తగ్గించిందని తన నానమ్మపై ఓ బాలుడు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశాడు.
హైదరాబాద్ :చిన్న పిల్లాడు ఏకంగా పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు . తనను ఆడుకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని ఆయన తన నానమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు పెట్టాల్సిందేనని పోలీసులను పట్టుబట్టాడు.
ఉదయం పూట కాదు ఏకంగా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కువచ్చి మరీ పోలీసులకు చుక్కలు చూపించాడు ఆ బుడతడు. అయితే పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

తనను ఆరుబయట ఆడుకోకుండా తన నానమ్మ అడ్డుకొంటోందని ఆ బాలుడు ఆరోపించాడు. ఈ మేరకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. తన పిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయాలని ఆ బాలుడు పట్టుబట్టడంతో పోలీసులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ ఆర్ నగర్ పరిధిలోని కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తోన్న వ్యక్తి కొడుకు తన నానమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనను ఆడుకోకుండా తన సమయాన్ని తగ్గిస్తోందని ఆమెపై ఆరోపణలు చేశాడు. అయితే తన కొడుకుపై సీరియళ్ళ ప్రభావం కన్పిస్తోందని బాలుడి తండ్రి చెప్పారు. పోలీసులు బాలుడికి చాక్లెట్లు ఇచ్చి అతన్ని సముదాయించారు.పోలీసుల హమీతో బాలుడు తన పిర్యాదును ఉపసంహరించుకొన్నాడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications